నిడమనూరు: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం నిడ మనూరు మండలం గుంటిపల్లి, బాలపురం, గ్రామాలకు చెందిన ముగ్గురికి రూ.1,80,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించుకున్న పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో సీఎంఆర్ఎఫ్ పథకం అమలు చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బోల్లం జయమ్మ, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ ఇరిగినేని అంజయ్య, మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, సర్పంచ్ సంధ్యారాణి, ఉప సర్పంచ్ యాదగిరి, గ్రామాధ్యక్షుడు విజేందర్, టీఆర్ఎస్ నాయకులు మధుబాబు, మెరుగు రామలింగయ్య, కళావతి, సర్పంచ్లు రాంబాబు, మమత కోటిరెడ్డి, ఉప సర్పంచ్ నాగయ్య, నాయకులు సైదాచారి, తిరుపతిచారి, జానయ్య, లక్ష్మణ్, లక్ష్మమ్మ, పద్మావతి రెడ్డి తదితరులున్నారు.
త్రిపురారం: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం త్రిపురారం మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్దిదారులకు రూ.6,41,500 విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు ఇబ్బందులు పడకుం డా ఉంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. అనంతరం సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి తండ్రి పెదకోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, త్రిపురారం మండల పార్టీ అధ్యక్షులు బహునూతల నరేందర్, మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, వనజ, యూత్ అధ్యక్షుడు ధనావత్ రవి, ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, నాయకులు పెద్దబోయిన శ్రీనివాస్, మాతంగి నాగరాజు, జంగిలి శ్రీనివాస్, అవిరెండ్ల సైదులు, వెంకటేశ్వర్లు, మడుపు వెంకటేశ్వర్లు, సర్పంచులు మట్టయ్య, అడివయ్య, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.