కొత్త కమిషనర్గా సత్యనారాయణరెడ్డి
బొడ్రాయిబజార్, మే 17 : సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి హైదరాబాద్ పెద్దఅంబర్పేటకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న సత్యనారాయణరెడ్డి రానున్నారు. మున్సిపల్ కమిషనర్గా పి.రామానుజులరెడ్డి మూడేళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాల్టీ ప్రజలకు విషేష సేవలందించారు. కరోనా సమయంలో మీ కోసం యాప్ రూపొందించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందించారు.
మున్సిపల్, పారిశుధ్య సిబ్బందికి ధైర్యం చెప్పి వారితో పనులు చేయించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేశారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సూర్యాపేటగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కింది. కమిషనర్ రామానుజులరెడ్డి హయాంలో సూర్యాపేట మున్సిపాల్టీకి స్కోచ్ అవార్డు రావడంతో పాటు మూడేళ్లుగా 100శాతం పన్ను వసూలు చేసినందుకు ఉత్తమ కమిషనర్గా అవార్డును అందుకున్నారు. చెత్త నుంచి ఆదాయం సమకూర్చేందుకు సింగిల్ యూజ్ వేస్ట్ ప్లాస్టిక్తో తయారు చేసిన అక్యూప్రజర్ మ్యాట్, ప్లాస్టిక్ ఇటుకలు, టైల్స్ను ఇటీవల రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.