నకిరేకల్, మార్చి 1 : సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి జరుగుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ తీగల మహేశ్, యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు తీగల నవీన్, వెంకటేశ్, దిలీప్, కిశోర్, శోభన్, జనార్దన్, జానయ్య, శివ, గోవర్దన్, శంకర్, గణేశ్, సందీప్, వేణు, నాగరాజు, చిరంజీవి, శ్రీకాంత్, వీరయ్య, భరత్, అంజయ్య, నితిన్, వరుణ్ ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, దైద పరమేశ్, గుర్రం గణేశ్ పాల్గొన్నారు.