నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగిన టూరిస్ట్ గైడ్ల శిక్షణలో ఆదివారం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితమైన సమాచారం, చక్కటి వేషధారణ, ఆకర్షించే ఉచ్ఛారణ, బుద్ధవనంలోని ఆసక్తికరమైన కథనాలపై టూరిస్ట్ గైడ్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి మనోహర్ మాట్లాడుతూ టూర్ గైడ్లు మంచి ప్రవర్తనతో పర్యాట కులతో మర్యాదగా మెలగాలని, పర్యాటకుల సమయము ఆసక్తి మేరకు సమాచారం అందించాలన్నారు.
అనంతరం శిక్షణ పొందిన 17మంది టూరిస్ట్ గైడ్లకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో శిక్షణ తరగుతుల నిర్వా హకులు ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డి సుధాన్రెడ్డి, ఎస్ఈ క్రాంతిబాబు, సహాయక శిల్పి శ్యామ్సుందర్, ఎఈ జగదీశ్ తదితరలు పాల్గొన్నారు.