నందికొండ, మే 13 : 1955 డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎన్నో కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినా పాలనా పరంగా గ్రామ పంచాయతీగానూ నోచుకోలేదు. దాంతో కనీస వసతులు కూడా కరువై సాగర్ ప్రజానీకం ఏండ్ల తరబడి సమస్యలతో కొట్టుమిట్టాడింది.
సమైక్య పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు తప్ప.. అభివృద్ధిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నాగార్జునసాగర్ దశ మారింది. వార్డుగానూ గుర్తింపు దక్కని నందికొండ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఎనిమిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
నందికొండ మున్సిపాలిటీలో జరిగిన ప్రగతి..
గత పాలకులు ఓటు బ్యాంక్కే పరిమితం చేశారు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాగర్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. కానీ, ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ పాలనలో నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తూ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది.
– మాలె వల్లభరెడ్డి, స్థానికుడు, హిల్కాలనీ