నీలగిరి: సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రుపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పదో వార్డు లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నీలగిరి కాల నీలో వీధుల గుండా తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసు కుని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణాన్నిఅన్ని రంగాలల్లో అభివృద్ధి చేసేందుకు తగిన విధంగా ప్రణాళిక రుపోందించుకుని పని చేస్తున్నామన్నారు. పట్టణంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరు గుతుందన్నారు. అందులోభాగంగా ఓపెన్ జిమ్లు, పార్కుల అభివృద్ధి, వైకుంఠధామాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడు తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఉదయ సముద్రం నల్లగొండ పట్టణానికి అనుకుని ఉన్నా పానగల్కు పూర్తిగా, పట్టణానికి మూడు, నాలుగు రోజులకు ఒక్కసారి మాత్రమే నీరు వచ్చేదన్నారు. తాను ప్రత్యేక చోరవ తీసుకుని రెండో పైపు లైన్ వేయించి రోజు తప్పించి రోజూ నీరు అందిచేలా చేశామని తెలిపారు. నల్లగొండకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడమే కాకుండా రూ.250 కోట్లతో భవనాన్ని మంజూరు చేశారని త్వరలో దీనికి శంకుస్ధాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆదేవిధంగా వెటర్నరీ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను కూడా మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్ ప్రదీప్, కాలనీ వాసులు సైదులు గౌడ్, చింతరెడ్డి పాండురెడ్డి, సుధార్, చిలుకరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.