– నల్లగొండ 4వ వార్డు అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్
నీలగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. భాస్కర్ టాకీస్ నుండి హ్యాపీ హోమ్స్ వరకు నాలుగు లైన్ల రోడ్డును విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి అంతా ప్రజల కండ్ల ముందే ఉందని తెలిపారు. కావునా ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు కోట సైదులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు అల్లందాస్ పెద్దులు, పొనుగోటి జనార్దన్ రావు, కాలనీవాసులు సంపత్, లచ్చయ్య, అంజయ్య, వినయ్, శ్రీకాంత్, నరసింహ పాల్గొన్నారు.