సూర్యాపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
సత్తెమ్మ: సారూ..నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా ఊరికి ఏం జేసినవ్ ? మల్ల వచ్చి ఓట్లు అడుగుతున్నవ్ ?
రాజగోపాల్రెడ్డి: టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయనీయలేదు. అందుకే రాజీనామా చేసిన.
సత్తెమ్మ: ఇప్పుడు వాళ్ల (టీఆర్ఎస్) ప్రభుత్వమే ఉన్నది కదా..మల్లెట్లా?
రాజగోపాల్రెడ్డి: కేంద్రం నుంచి నిధులు తెస్తా.
సత్తెమ్మ: మా ఊరికి వీళ్లు ఇయ్యరు కానీ..వాళ్లు ఇస్తరా?
రాజగోపాల్రెడ్డి: ఈ సారైతే గెలిపించండమ్మా అంటూ కారెక్కి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన అనంతరం సత్తెమ్మ మాట్లాడుతూ..‘పోయిన ఎన్నికలల్ల ఇదే రాజగోపాల్రెడ్డి బీజేపీ దొంగల పార్టీ అన్నడు..కాంగ్రెస్ గెలిచే పార్టీ అన్నడు. మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఇప్పుడు ఆయనే దొంగల పార్టీల కలిసిండు. ఆయిన మాటలు ఇని బీజేపీకి ఓటేస్తే మా కొంపలు మునిగినట్టే’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.