నీలగిరి: దేశంలోనే ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. సోమవారం వీటీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 310 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 3కోట్ల 10లక్షల 35వేల 960 రూపాయల విలువేన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలు పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకలుగా వారి కుటుంబాలలో సంతోషాన్ని పంచుతున్నాయన్నారు. పెళ్లి ఖర్చుల భారంతో వ్యయ ప్రయాసలతో ఇబ్బంది పడే కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని వారి అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నదన్నారు. పేద ప్రజలంతా ఎప్పటికీ ఇటువంటి ప్రభుత్వాలనే కోరుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోర్రా సుధాకర్, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీం పాష, నాగులంచ విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్లు అలకుంట్ల నాగరత్నంరాజు, వంగాల సహదేవ్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు. నాయకులు పల్రెడ్డి రవీందర్రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకట్రెడ్డి పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.