సత్తాచాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
ఎంపీసీలో సూర్యాపేట విద్యార్థులకు సెకండ్ ర్యాంక్
ఎంబీపీసీలో 6, 9, 10, 11, 15 ర్యాంకులు మనవే..
పాలిటెక్నిక్ డిప్ల్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో 120 మార్కులకుగాను 119 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంకును సూర్యాపేట విద్యానగర్కు చెందిన సూరినేని భానుప్రసాద్, కోదాడ శ్రీనివాసనగర్కు చెందిన చిత్తలూరి సాయిరోహిత్ దక్కించుకున్నారు. ఎంబీపీసీలో 6 నుంచి 15 ర్యాంకులు ఉమ్మడి జిల్లా విద్యార్థులవే కావడం విశేషం.
రామగిరి, జూలై 13 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్ -2022 ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ సంస్థ బుధవారం విడుదల చేసింది. గత నెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు.ఎంపీసీ విభాగంలో సూర్యాపేటలోని విద్యానగర్కు చెందిన సూరినేని భానుప్రసాద్119/120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, కోదాడలోని శ్రీనివాసనగర్కు చెందిన చిత్తలూరి సాయిరోహిత్ 5వ ర్యాంకు సాధించారు.
ఫలితాల్లో టాపర్లుగా నిలిచింది వీరే..
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగులకు చెందిన కల్లు జాహ్నవిరెడ్డి ఎంబీపీసీ విభాగంలో 115/120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సూర్యాపేట జిల్లాకు చెందిన మద్ది హర్షిణి 144.5/120, దేవరకొండలోని సాయిసూర్యనగర్కాలనీకి చెందిన చాట్ల అవినాశ్ తేజ 144.5/120, మార్కులతో రాష్ట్ర స్థాయిలో 10,11వ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఎంబీపీసీ విభాగంలో మాడిపెద్ది ప్రమోద్ రాష్ట్రస్థ్ధాయిలో 15వ ర్యాంకు సాధించారు.
సూర్యాపేట జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో…
జిల్లా వారీగా ఉత్తీర్ణత ఇలా…