నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్, నోముల భగత్, చిరుమర్తి లింగయ్య హాజరై తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.