నకిరేకల్, డిసెంబర్ 10 : పట్టణంలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. శనివారం మార్నింగ్ వాక్లో భాగంగా ఆయన మున్సిపాలిటీ పరిధిలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్లో సెంట్రల్ లైటింగ్ పనులు 3 నెలల వ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. రూ. 26 కోట్లతో ప్రధాన రహదారి పనులు ప్రారంభించామని, రూ. 32 కోట్లతో వంద పడకల ఆస్సత్రి పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. కాలం వారి కుంట సుందరీకరణకు రూ. 4.64 కోట్లు, కడపర్తి డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.2.94 కోట్లు, పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. కోటి నిధులు త్వరలో మంజూరు కానున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నమన్నారు. అంతకుముందు చిన్నారితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నడిచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, సదానందం, పరమేశ్, గణేశ్, శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ శివమూర్తి పాల్గొన్నారు.
చర్చి అభివృద్ధికి కృషి
కట్టంగూర్ : చర్చి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ పరిధిలోని చిన్నపురిలో జరిగిన గుడి పండుగలో ఆయన పాల్గొని నిష్కళంక మాతా మందిరంలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, జయంతి, విన్సెంట్, ఆనంద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, నాయకులు హరికృష్ణ, కృష్ణ, కొండల్ పాల్గొన్నారు.
అయ్యప్ప పడిపూజలో ఎమ్మెల్యే
నార్కట్పల్లి : పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శని వారం నిర్వహించిన మహా పడిపూజ కార్య క్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బెల్లి వెంక టేశ్వర్లు, గురుస్వాములు ఉన్నారు.