చిట్యాల, డిసెంబర్ 10 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, మార్కెట్ యార్డులో రూ.1.30 కోట్లతో నిర్మించనున్న 30 దుకాణాల సముదాయానికి శనివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. సమైక్య వాదులు మళ్లీ తెలంగాణపై కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్. జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి, మార్కెట్ కార్యదర్శి జానయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, నాయకులు కల్లూరి మల్లారెడ్డి, మెండె సైదులు, గుండెబోయిన సైదులు, వనమా వెంకటేశ్వర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.