సూర్యాపేట అర్బన్, డిసెంబర్ 7 : విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు నైపుణ్యాన్ని గుర్తించి వారి బంగారు భవిష్యత్ బాటలు వేయాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో సూర్యాపేట జిల్లా సత్తాను చాటాలని పిలుపునిచ్చారు.
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 518 విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న కమిటీలను ఆమె అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు దాతలుగా వ్యవహరించిన పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, జయ వేణుగోపాల్, బెల్లంకొండ రామ్మూర్తి, గోపగాని గిరి, ముప్పారపు నరేందర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ అశోక్, జడ్పీ సీఈఓ సురేశ్, జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, ఏడీ శైలజ, సైన్స్ ఎగ్జిబిషన్ కన్వీనర్ ఛత్రునాయక్, కో-కన్వీనర్లు ఎన్.రవి, గోపాల్రావు, సలీంషరీఫ్ పాల్గొన్నారు.