మద్దిరాల, నవంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం ఈడీ, బోడీలతో భయపెట్టాలని చూసినా ఇక్కడ భయపడే వారెవరూ లేరని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ విమర్శించారు. మండల కేంద్రంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న వారికి గురువారం ఆయన జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగేంధర్రావుతో కలిసి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజలు సైతం మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 350మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరినట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎస్ఏ.రజాక్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బెజ్జెంకి శ్రీరాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్దన్రెడ్డి, జిల్లా నాయకులు దుగ్యాల రవీందర్రావు, వెంకన్న, మండల కార్యదర్శి సూరినేని నర్సింహారావు, నాయకులు పాతూరి లింగారెడ్డి, వెంకట్రెడ్డి, తీగల వెంకన్న, వడ్డానం మధుసూదన్, మండల యువజన నాయకులు మల్లు ఉపేందర్రెడ్డి, వల్లపు రమేశ్యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.