రామగిరి, నవంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థ్ధలుగా వాడుకుంటూ నిర్వీర్యం చేస్తున్నదని ఉస్మానియా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజారాం యాదవ్ విమర్శించారు. నల్లగొండలోని లయన్స్ క్లబ్ భవనంలో ఆదివారం ‘కేంద్ర ప్రభుత్వం-రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో విషసంస్కృతిని ప్రవేశపెడుతూ మతం పేరుతో దేశంలో అరచకాలకు పా ల్పడుతుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని నాశనం చేస్తుందన్నారు.
రాజ్యాంగ సంస్థ్ధలపై కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తూ స్వలాభాలకు వాడుకుంటుందని దుయ్యాబట్టారు. బీజేపీలో చేరితే పదవులు కాంట్రాక్టర్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నందని విమర్శించారు. విద్యార్థులు, మేథావులు స్పందించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సమన్వయం ఉండాలని లేని పక్షంలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వలాభం కోసం వాడుకోవద్దని సూచించారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు అశోక్, నాయకుడు హరీశ్గౌడ్, గౌడ జేఏసీ చైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని ఆటంకపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీరు ఉండడం శోచనీయమన్నారు.
అదే విధంగా సమావేశానికి హాజరైన టీఎస్జేఏసీ, సామాజిక , ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. బక్కతట్ల వెంకట్ యాదవ్ నిర్వహణలో జరిగిన ఈ సమావేశంలో ఆయా సంఘాలు, సంస్థల నాయకులు పందుల సైదులు, అంబటి వెంకన్న, నేతి రఘుపతి, పాలడుగు నాగార్జున,టీఆర్ఎస్ నాయకులు చీర ఫంకజ్ యాదవ్, బకరం వెంకన్న, కవి, రచయిత మునాసు వెంకట్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు దుడుకు లక్ష్మీనారాయణ, మారపాక నరేందర్ పాల్గొన్నారు.