చిట్యాల, ఆగస్టు 11 : మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో గల గాంధీ గుడిని గురువారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుక చైర్మన్ ఎంపీ కేశవరావు ఆలోచన మేరకు గాంధీ గుడిని సందర్శించినట్లు తెలిపారు. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి పౌరుడు పాల్గొని దేశభక్తిని చాటాలన్నారు.