నార్కట్పల్లి, జూలై 22 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం నార్కట్పల్లి శబరి గార్డెన్స్లో అందజేశారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎన్నో పేదింటి కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తుచేశారు ప్రతీ ఆడబిడ్డ కూతురు పెళ్లి చేసి అప్పులపాలు కావద్దనే సీఎం ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కళాశాలను సందర్శన
పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే కళాశాలలో విద్యార్థులకు కరోనా సోకడంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కళాశాలను సందర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్లో ఉంచాలని ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలని ఆయన అధికారులకు సూచించారు.