హాలియా, జూలై 2 : రాష్ర్టానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. శనివారం గుర్రంపోడు, తిరుమలగిరి(సాగర్) మండలంలోని కృష్ణపట్టె ప్రాంతానికి చెందిన సుమారు 30 కుటుంబాబు హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు ప్రవేశపెట్టి యావత్ దేశ రైతాంగానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. గడిచిన ఏడాదిలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో నియోజకవర్గ ప్రజలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి నెల్లికల్లు లిఫ్ట్ పూర్తిచేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, గజ్జెల చెన్నారెడ్డి, వెలుగు రవి, సత్యనారాయణ, తేలుకుంట్ల కుర్మారెడ్డి, ఎన్నమల్ల సత్యం, పిల్లి అభినయ్, నామాల సురేందర్, బడుగుల శ్రీను, పృథ్వీరాజ్, బూడిద హరికృష్ణ, పెద్దిరాజు, కాసాని చంటి, మల్లికార్జున్, కార్తీక్, మెండె లింగయ్య, పోలె నర్సింహ పాల్గొన్నారు.