భువనగిరి అర్బన్, జూలై 2 : పేదరిక నిర్మూలనకు ఏర్పాటు చేసిన పథకాలు లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు అన్నారు. మండలి న్యాయ సేవా సంస్థ, భువనగిరి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మెప్మా, డీఆర్డీఏ రిసోర్స్పర్సన్లకు పేదరిక నిర్మూలన అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సును భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలభాస్కర్రావు మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఈ పథకం సరైన క్రమంలో అమలు పరిచేలా చర్యలు, అవగాహన కల్పించే బాధ్యత మెప్మా, డీఆర్డీఏ రిసోర్స్పర్సన్లు తీసుకోవాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు ఏర్పాటు చేసిన చట్టాలను ప్రతి పౌరుడూ తెలుసుకుని చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలన్నారు. అనంతరం బ్యాంకు నుంచి మంజూరైన రుణాల చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.నాగిరెడ్డి, భువనగిరి న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు బి.శేశవరెడ్డి, మెప్మా కోఆర్డినేటర్ కవిత, డీఎంసీ రమేశ్, ఎంపీడీ రమణ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బూస్టర్ డోస్..
భువనగిరి అర్బన్ : భువనగిరి కోర్టు ప్రాంగణంలో కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ క్యాంపును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్రావు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీదేవికి బూస్టర్ డోస్ పంపిణీ చేశారు. అదేవిధంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి పంపిణీ చేశారు.