చండూరు, జూలై 2 : యువత లక్ష్య సాధనలో ముందుండాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నందున సొంత ఖర్ఛులతో చండూరులో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను శనివారం ఆయన సందర్శించి అభ్యర్థులకు ైస్టెఫండ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులు లక్ష్యంతో ఉద్యోగం సాధించే వరకు పోరాడాలన్నారు.
నిరుపేద అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా చండూరు, చౌటుప్పల్లో కోచింగ్తో పాటు మెటీరియల్, స్టెఫండ్ అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కోడి వెంకన్న, జయం ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు ఐతరాజు లక్ష్మణ్, పట్టణాధ్యక్షుడు భూతరాజు ధశరథ, కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్, పెండ్యాల గీత, సుదర్శన్, నందికొండ నర్సిరెడ్డి, సత్తయ్య, చంద్రశేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.