సూర్యాపేట మండలం టేకుమట్ల, పెన్పహాడ్ మండల కేంద్రంలో సోమవారం చౌడమ్మ-లింగమంతుల జాతరలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్తో కలిసి భేరీ మోగించి ఉత్సవాల్లో జోష్ నింపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే పల్లె పండుగలకు గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే గ్రామ దేవతల జాతరలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని తెలిపారు. అనంతరం టేకుమట్లలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు, కేసారంలో సంత్ నిరంకారి భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
పెన్పహాడ్, మే 23 : ఆచార సంప్రదాయాలు, కుల, గ్రామ దేవతల పండుగలు, జాతరలు ఉమ్మడి రాష్ట్రంలో మరుగున పడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్వ వైభవం సంతరించుకున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని యాదవుల ఆరాధ్య దైవం సౌడమ్మ-లింగమంతుల జాతరలో మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా యాదవులు మంత్రితోపాటు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ను సంప్రదాయ బద్ధంగా భేరీ మోగించి ఆహ్వానించారు.
మంత్రికి యాదవులు గొంగడి, తలపాక కప్పి గొర్రె పిల్లను అందించారు. అనంతరం డీఎంఎఫ్టీ నిధులు రూ.9లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి కూడా దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మ, మండల కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేంధర్, నాయకులు తూముల ఇంద్రసేనారావు, బొల్లక బొబ్బయ్య, బొల్లక సైదులు, బొల్లక లింగయ్య, సర్పంచులు పరెడ్డి సీతారాంరెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, చెన్ను శ్రీనివాస్రెడ్డి, అనంతుల శ్రీనివాస్గౌడ్, భరత్, ఎగ్గడి మురళి, కట్ల నాగార్జున, నాగునాయక్, మున్న వెంకన్న, బొల్లెద్దు వినోద్, స్వర్ణ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : స్వరాష్ట్రంలోనే గ్రామీణ పండులకు ప్రాధాన్యం దక్కుతున్నదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలలోని టేకుమట్లలో సౌడమ్మ జాతరకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, సర్పంచ్ పిండిగ పద్మ, యాదవులు జానకిరాములు, సైదులు, సౌడయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : ప్రతి ఒక్కరూ తమ ఆచారాలకు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. సోమవారం గట్టికల్లో జరుగుతున్న లింగమంతుల జాతరలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, సర్పంచ్ బచ్చలకూరి సాలమ్మ, సింగిల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నరసింహారావు, మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, బత్తుల ప్రసాద్, తంగెళ్ల మధుసూదన్రెడ్డి, దండు మైసమ్మ ఆలయ మాజీ చైర్మన్ బెల్లంకొండ యాగిరిగౌడ్, బ్రహ్మంగౌడ్ పాల్గొన్నారు.