మర్రిగూడ, ఆగస్టు 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేశ్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, లెంకలపల్లి సర్పంచ్ నగేశ్యాదవ్, ఎంపీటీసీ శ్రీశైలం, సరంపేట సర్పంచ్ వెంకటమ్మామధుకర్, సంస్థాన్నారాయణపురం మండలం మహ్మదాబాద్ ఉప సర్పంచ్ మాధురీసమరసింహారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చైతన్య మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం గులాబీ కండువా కప్పుకొన్నారు.
సంస్థాన్నారాయణపురం మండలం కడపగండితండాకు చెందిన కాంగ్రెస్ ఉప సర్పంచ్ లచ్చిరాంనాయక్, వార్డు సభ్యుడు రమావత్ భాస్కర్నాయక్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో, అల్లందేవి చెరువుకు చెందిన సుర్వి జంగయ్యగౌడ్తోపాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడేనికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు 50 మంది హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
టీఆర్ఎస్లో కాంగ్రెస్ నాయకుల చేరిక
సంస్థాన్ నారాయణపురం : మండంలోని అల్లందేవి చెరువు కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్వి జంగయ్య గౌడ్, నాయకులు ఎర్పుల దశరథ, ఎర్పుల రాములు బుధవారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ సుర్వి యాదయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్పుల రాజేశ్ పాల్గొన్నారు.