కలెక్టర్ రాహుల్ శర్మ
నల్లగొండ, జూలై 19 : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్కల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని, సిజేరియన్ చేయాల్సి వస్తే కారణాలు రాసి పెట్టాలన్నారు. సాధారణ ప్రసవాలయ్యే పరిస్థ్దితి ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద ఆపరేషన్లు చేసి తల్లీబిడ్డల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లి పాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెద్ద ఆపరేషన్ల కారణంగా వారం దాకా తల్లికి పాలు వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని నిపుణులు సూచిస్తున్నందున సాధారణ ప్రసవాలు చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుంటున్న వారి వివరాలు పక్కగా రికార్డు చేయాలని సూచించారు.
ఆస్పత్రులకు కాన్పుల కోసం వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డీసీహెచ్ మాతృ పాల్గొన్నారు.