కట్టంగూర్/ చిట్యాల, జూలై 5 : పల్లెల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం మండలంలోని పామనుగండ్ల, బొల్లెపల్లి, కట్టంగూర్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంపై నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. రెండ్రోజుల్లో ఇంటింటికీ మొక్కలు పంపిణీని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య, జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఎంపీఓ అథర్ పర్వేజ్, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, చెనగోని సతీశ్, మేడ రేణుక, ఉప సర్పంచ్ శ్రీను, కార్యదర్శులు పాల్గొన్నారు. చిట్యాల 5వ వార్డులో కౌన్సిలర్ జడల పూలమ్మాచినమల్లయ్య అధ్యక్షతన జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. వైద్యాధికారి కిరణ్కుమార్ను సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, కమిషనర్ ఎం.రామదుర్గారెడ్డి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య పాల్గొన్నారు.
ఎంజీయూలో హరితహారం
రామగిరి : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హరితహారం నిర్వహించారు. వీసీ గోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ పి.విష్ణుదేవ్తో కలిసి పాలకమండలి సభ్యులు మొక్కలు నాటారు. అనంతరం వీసీ తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, యూనివర్సిటీ అభివృద్ధి, నూతన కోర్సులపై చర్చించారు. పాలకమండలి సభ్యులు ఆకుల రవి, అంజిరెడ్డి, శ్రీదేవి, కృష్ణారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, ఘన్శ్యాం, కోటేశ్వర్రావు, రమేశ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమేశ్ పాల్గొన్నారు.
పల్లెలు కళకళలాడాలి: ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి
నల్లగొండ రూరల్ : ప్రతి గ్రామంలోనూ పచ్చదనంతో కళకళలాడి ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపట్టిందని నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని దండంపల్లి, రెడ్డికాలనీ, అన్నెపర్తి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు. ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ మాధవరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్రెడ్డి, పుష్పాసైదులు, అరవింద్రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్..
కట్టంగూర్ : మండలంలోని భాస్కర్లబాయి గ్రామంలో సర్పంచ్ చినపాక పరశురాములు ఇంటింటికీ జామ, మామిడి, సపోట, మునగ మొక్కలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ కత్తుల జ్యోతీదేవేందర్, పంచాయతీ కార్యదర్శి గుండమల్ల రేణుక, అంగన్వాడీ టీచర్ ఇందిర, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రత్యేకాధికారి..
శాలిగౌరారం : మండలంలోని శాలిలింగోటంలో మండల ప్రత్యేకాధికారి తిరుపతయ్య మొక్కలు నాటారు. సర్పంచ్ పార మౌనికతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అశోక్, పాక యాదయ్య పాల్గొన్నారు.
పిచ్చిమొక్కల తొలగింపు..
మునుగోడు : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండల ప్రత్యేకాధికారి హుస్సేన్బాబా శ్రమదానం చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటి, గ్రామస్తులకు పంపిణీ చేశారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఎంపీడీఓ యాకూబ్నాయక్, ఎంపీఓ సుమలత, సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఏపీఓ శ్రీనయ్య, ఎంపీటీసీ బొడ్డు శ్రావణి, పంచాయతీ కార్యదర్శి మురళీమోహన్, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. రావిగూడెంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం రోడ్డుకు ఇరువైపులా డోజర్తో పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. నాగయ్య, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు.
వీధులు శుభ్రం..
మర్రిగూడ : హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు వృక్షాలను కానుకగా ఇవ్వాలని జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి అన్నారు. ఖుదాభక్ష్పల్లిలో వీధులను శుభ్రం చేయించి గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. మర్రిగూడలో సర్పంచ్ నల్ల యాదయ్య వీధుల్లోని పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలను పంపిణీ చేశారు. సర్పంచ్ ఆంబోతు సుధాకర్నాయక్, పంచాయతీ కార్యదర్శులు యూసుఫ్, పార్వతి, పందుల పాండుగౌడ్ పాల్గొన్నారు.