నకిరేకల్, మార్చి 3 : విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, అది రేపటి భవిష్యత్ను నిర్ణయిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మినీ స్టేడియంలో శనివారం రాత్రి కృష్ణవేణి హైస్కూల్ వార్షికోత్సవాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన రావాలంటే వార్తా పత్రికలు, కథల పుస్తకాల లాంటివి నిరంతరం చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి తమ పాఠశాలలో తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులకు పదో తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా, మెమోంటోతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అల రించాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ మేక నాగయ్య, కరస్పాండెంట్ వి.యశ్వంత్రెడ్డి, ప్రిన్సిపల్ జోత్స్న, కౌన్సిలర్లు సుకన్య, స్వామి, శ్రీను,నాయకులు రాఘవరెడ్డి, కరుణాకర్రెడ్డి, వలిశెట్టి స్వప్న పాల్గొన్నారు.
చిట్యాల : ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, నియోజకవర్గంలోని ప్రతి మైనార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాలలో సయీదా సయ్యద్ కుటుంబ ఆర్థిక సాయంతో రూ. 4.6 కోట్లతో పునర్నిర్మించిన మదీన మసీద్ పునః ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఢిల్లీ మాజీ ఎంపీ మహ్మద్ మజాద్, ముఫ్తీ సిద్దిక్, మౌలానా ఎహ్సానొద్దీన్ ఖాస్మీ, హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్, అబ్దుల్ ముఫ్తీ, ఎస్కే ఇబ్రహీం, ముబిన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, పోకల దేవదాసు, బట్టు అయిలేశ్, కాకులారపు బొర్రారెడ్డి, జహంగీర్, సయ్యద్ అన్వర్, ఎస్కే కరీం, జమీరుద్దీన్, దాయ్రా, నిస్సార్, ముబీన్, ముక్తదీర్, షకీర్, జిట్ట చంద్రకాంత్, దాసరి నర్సింహ, కల్లెం నర్సింహ పాల్గొన్నారు.