చిట్యాల, జనవరి 25 : నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని పేరెపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు, బొంగోని చెరువులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, గ్రామ పంచాయతీ భవనానికి, వెలిమినేడులో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ గ్రామాల రూపు రేఖలను మార్చి ప్రజల్లో గుణాత్మక మార్పు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీ.లాజర్, డీఈ నర్సింహ, సర్పంచులు అంతటి వెంకటేశం, సామిడి మోహన్రెడ్డి, దేశబోయిన మల్లమ్మ, జనగాం రవీందర్, ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేశ్, నాయకులు నర్రా మోహన్రెడ్డి, కాటం వెంకటేశం, బట్టు అయిలేశ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
చిట్యాల: పీఏసీఎస్ పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేయాల ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రఘుమారెడ్డితో డీసీఓ కిరణ్కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్లు పిశాటి భీష్మారెడ్డి, అజిత్రెడ్డి, గంగాపురం భాస్కర్, కొంపెల్లి వెంకట్రెడ్డి, నర్రా మోహన్రెడ్డి, మోహన్రెడ్డి, కాటం వెంకటేశం, కంచర్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.