నకిరేకల్, అక్టోబర్ 18 : దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కొట్లాటలు, అశాంతి తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
మన రాష్ట్రంలో అమలు చేసిన కంటివెలుగు పథకాన్ని ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఐదేండ్లలో నకిరేకల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ముందు ఆ పార్టీ నాయకులకే అర్థం కావట్లేదన్నారు. కర్ణాటకలో ఉన్నది రెండు పార్టీలేనని, అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు దిక్కులేక కాంగ్రెస్కు ఓటు వేశారన్నారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కుర్చీలాట ఆడుతున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొట్లాటలు, పొట్లాటలు, కుర్చీలాటలు తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ పింఛన్లు రూ.400, 500 మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం ఆసరీ పింఛన్లు రూ.2,016, రూ.4,016 ఇస్తున్నారన్నారు.
ఇది తెలుసుకున్న సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమకూ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందని, ఇందులోని అంశాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. బీఆర్ఎస్కు ఓటేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత మిగిలి ఉన్న అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో పూర్తి చేస్తానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నాయకులు తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, పెండెం సదానందం, సోమ యాదగిరి, దైద పరమేశ్, గుర్రం గణేశ్, మహమూద్ అలీ, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
నకిరేకల్ : పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని దేవాలయ కమిటీని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఒకటో వార్డు, మండలంలోని కడపర్తి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, నడికుడి వెంకటేశ్వర్లు, కొండ జానయ్యగౌడ్, రాచకొండ వెంకన్న, పొడుగు లక్ష్మయ్య, సోమయ్య, కౌన్సిలర్లు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.