నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్ల శిక్షణా కార్యక్రమాన్ని బుధ వారం బుద్ధవనంలో ప్రారంభించారు. బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి, టూరిస్ట్ గైడ్ల శిక్షణా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులు 5 రోజుల పాటు కొనసాగుతాయని, ఈ శిక్షణ తరుగుతులలో సందర్శకులతో ఏ విధంగా నడుచుకోవాలి, వారికి చారిత్రక విశేషాలను ఏ విధంగా వివరించాలో నేర్పుతామన్నారు. అనం తరం ప్రొఫెసర్ మహేందర్రెడ్డి గైడ్గా నైపుణ్యం ఎలా పెంచుకోవాలో వివరించారు. కార్యక్రమంలో బుద్ధవనం సహాయక శిల్పి శ్యాంసుందర్, టూరిజం గైడ్ సత్యనారాయణ, కేవీ, నరసింహారావు పాల్గొన్నారు.