కట్టంగూర్, జూలై 11 : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కోశాధికారి గజ్జి రవి అన్నారు. శనివారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో నాగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా ప్రజా సాస్కృతిక ఉద్యమంలో అరుణోదయ నాగన్న కీలకపాత్ర పోషిస్తూ తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బూరుగు సత్తయ్య, పెరక శ్రీను, దండెంపల్లి చంద్రయ్య, గద్దపాటి పాపయ్య, అంజయ్య, యాదయ్య, మార్కెండయ్య, చింత మల్లయ్య, బుర్రి బిక్షం, అంజయ్య పాల్గొన్నారు.