కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుదలను నిలిపివేశారు.
10 రోజుల విరామం తర్వాత ఈ నెల 30 నుంచి రెండో విడుత నీటిని విడుదల చేయనున్నట్లు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1307.33 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 640.44(3.32 టీఎంసీలు)అడుగులుగా ఉంది. 27 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుంది. ఔట్ఫ్లో లేదు.