చండూరు, జూన్ 19 : ఉప ఎన్నికల తర్వాత మునుగోడు నియోజకవర్గం వంద స్పీడ్తో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన హరితోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల ప్రభుత్వ భూమిలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదన్నారు. గత ఎమ్మెల్యే తట్టెడు మట్టికూడా తీయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ చేపట్టి ఫ్లోరోసిస్ తరమిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. చండూరులో త్వరలో రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. గట్టుప్పల నుంచి కొండ మల్లేపల్లి వరకు రూ.90 కోట్లతో డబుల్రోడ్డు నిర్మించనున్నట్లు చెప్పారు. అంతకు ముందుగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ ఛైర్మన్ కోడి సుష్మావెంకన్న, కమిషనర్ ఖాజామొజాయిద్దీన్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, తోకల వెంకన్న, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, కో ఆప్షన్ సభ్యుడు ముజ్జు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉజ్జిని అనిల్రావు, ఏత్తపు మధుసూదన్రావు పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్: మండలంలోని దండు మల్కాపురం గ్రామంలోఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడంతోపాటు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. అలాగే మండలంలోని గ్రామాల్లో హరితోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ ఎల్వర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, పీఏసీఎస్ చింతల దామోదర్రెడ్డి, గ్రామ సెక్రటరీ సైదిరెడ్డి పాల్గొన్నారు.
బీటీ రోడ్డు నిర్మాణానికీ శంకుస్థాపన
జాతీయ రహదారి-65 నుంచి మల్కాపురం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికీ స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ.1.4 కోట్లతో నిర్మించనున్న రోడ్డుని త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన సిద్దిపేట నర్సింహారెడ్డి, పెంబర్ల పద్మకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కు ను అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ ఎల్వర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్రావు,ఆందోళ్ మైసమ్మ ఆలయ చైర్మన్ సిద్దిపేట శేఖర్రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ బోయిని లింగస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కాటి నిరంజన్గౌడ్, ఉప సర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ, గ్రామశాఖ అధ్యక్షుడు ఈడ్దుల మస్తాన్ బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటా రు. కార్యక్రమంలోఎంపీపీ కర్నాటిస్వామియాదవ్, ఎంపీడీఓ ఆర్. భాస్కర్, సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఎంపీటీసీలు ఈద నిర్మలాశరత్బాబు, బొడు ్డశ్రావణీనాగరాజుగౌడ్, పీఆర్డీఈ రఘుపతి, వ్యవసాయ ఏడీ యాదగిరి, ఏఈ రామకృష్ణ, ఎంపీఓ సుమలత, కార్యదర్శి మురళీమోహన్, పం దుల శ్రీను, శ్యామల, కల్పన పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని మేళ్లవాయిలో ఎక్సైజ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతుబందు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, ఎంపీడీ శేషుకుమార్, ఎక్సైజ్ సీఐ భూషణ్, సర్పంచ్ గుండబోయిన మైవమ్మ పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని సరంపేటలో ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ వెనమల్ల వెంకటమ్మ, ఏపీఓ వెంకటేశం,పీఏసీఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మాన్య నాయక్, ఎంపీడీఓ రాములు, సర్పంచులు మైల యాదవరెడ్డి, పాపయ్య, సుర్వి యాదయ్య గౌడ్, దోనూరి సుశీల, పాండు రంగానాయక్ పాల్గొన్నారు.