నల్లగొండ, అక్టోబర్ 13 : మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసే నేతలకు నియోజక వర్గ కాంగ్రెస్ నేతల ఝలక్ ఇచ్చారు. వైన్స్ల కోసం టెండర్లు వేసే వారు ఇక నుంచి ఊరిబయటే వైన్స్లు ఏర్పాటు చేసుకోవాలని, అది కూడా సాయంత్రం నాలు గు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే విక్రయించాలని ఆ నేతలు సూ చించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల పేరుతో రూ పొందించిన ఆ వినతి పత్రాన్ని జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్కు అందచేశారు.
ఈ నిబంధనలు పాటించే వారు మాత్ర మే నియోజక వర్గంలో వైన్స్ల కోసం టెండర్లు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ నేతలు మాట్లాడుతూ మునుగోడు ప్రజల ప్రజల జీవన ప్రమాణాలు పెంచటంతోపాటు బెల్టు షాపుల నిర్మూలన, మహిళా సాధికారతతో పా టు, యువత మద్యానికి బానిస కావొద్దనే ఆలోచనతో ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పలు మండలాలకు చెందిన పల్లె వెంకన్న, కత్తి రవీందర్ రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవ రెడ్డి, రఘుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, దోటి వెంకటేశ్, చంద్ర శేఖర్, సత్యం తదితరులు ఉన్నారు.
ఇవీ నిబంధనలు..