నేరేడుచర్ల, జూన్ 25 : మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 25వ రోజు బుధవారం మున్సిపాలిటీలోని 5వ వార్డులో తడి చెత్త- పొడ్డి చెత్త వేరుచేసే విధానం, ఎరువు తయారీ, డెంగ్యూ, మలేరియాపై అవగాహాన కల్పిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం మురుగు కాల్వల్లో పూడిక తీయించి దోమలు వృద్ధి చెందకుండా మలాథియాన్ స్ప్రేయింగ్ చేయించారు. వాటర్ ట్యాంక్ల ద్వారా సరఫరా చేసే నీటికి క్లోరిన్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, వార్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమభావన సంఘం సభ్యులు పాల్గొన్నారు.