మాడ్గులపల్లి, మార్చి 12 : కార్గో సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా మండలంలోని కొత్తగూడెం వద్ద ఎఫ్సీఐ గోదాములో కార్గో సేవలను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెంలో ఎంపీ లింగయ్యయాదవ్ పాల్గొని మాట్లాడుతూ.. గోదాములు ఉన్న ప్రతి చోట కార్గో సేవలను అందుబాటులోకి తేవాలన్నారు. రైల్వేశాఖ ఎఫ్సీఐలను అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో గోదాము డైరెక్టర్లు వల్లపురెడ్డి కోటిరెడ్డి, సిరిగిరెడ్డి రాంరెడ్డి, జిల్లా శ్రీనివాస్రెడ్డి, పసునూరి ప్రహ్లాద్, ఎఫ్సీఐ డీఎం సుశీల్కుమార్, రైల్వే ఏడీఈఎన్ సుధాకర్, ప్రోగ్రాం ఇన్చార్జి సతీశ్ పాల్గొన్నారు.