నకిరేకల్, మార్చి 2 : లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ సేవలు అభినందనీయమని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాటికల్ వృద్ధాశ్రమంలో ఎంపీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మొదటి అంతస్తు అదనపు గదిని శనివారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అనాథలు, వృద్ధులను చేరదీసి ఆశ్రమం కల్పించడం గొప్ప విషయమన్నారు.
భవిష్యత్లో ఈ వృద్ధాశ్రమానికి మరిన్ని సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో ఎంపీని సన్మానించారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పీఎంజేఎఫ్ లయన్ శివప్రసాద్, లయన్ మోహన్రెడ్డి, డిస్టిక్ గవర్నర్ శివప్రసాద్, ట్రస్ట్ చైర్మన్ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ రామ్మోహన్రావు, క్లబ్ అధ్యక్షుడు ఉప్పల వెంకటరమణ, జోన్ చైర్మన్ అశోక్, లక్ష్మీనారాయణరెడ్డి, శ్రీనివాసులు, నారాయణ, నారాయణరెడ్డి, పాపిరెడ్డి, అంతయ్య పాల్గొన్నారు.