నకిరేకల్, నవంబర్ 3 : కాంగ్రెస్కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నోముల, పాలెం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు. అంతకుముందు గడపగడపకూ సంక్షేమ పథకాలు వివరిస్తూ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ, పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఆశ జూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు మూడు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చకలేక ఉక్కిరిబిక్కిరవుతుందన్నారు.
ఎన్నికల వేళ ఆగమాగం కాకుండా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలన్నారు. బీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కార్యక్రమాల్లో షిప్ అండ్ గోట్ కార్పొ రేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, చింతల సోమన్న జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఖాసీం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల సోమన్న, మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్, ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నాయకులు తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, సోమ యాదగిరి, వెల్మకంటి జానయ్య, పేర్ల కృష్ణకాంత్, పాలెం సర్పంచి ఏకుల కవితావిజయ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆలకుంట్ల సైదులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, బీఆర్ఎస్తోనే పేదలకు భద్రత లభిస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓట్లు అభ్యర్థ్ధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలనలో రైతులు నష్టపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు బాగుపడ్డారని తెలిపారు. మీ అందరి దీవెనలతో మళ్లీ గెలిస్తే గ్రామాన్ని మాడల్గా తీర్చిదిద్దడంతో పాటు గ్రామం నుంచి చెరువుగట్టు రోడ్డు వెళ్లే రోడ్డు బీటీ రోడ్డుగా మారుస్తానని పేర్కొన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పేవారితో కంగారు పడవద్దని.. కార్తు గుర్తుకు ఓటేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు గ్రామశివారులో మహిళలు హారతిచ్చి స్వాగతం పలికి కోలాటం వేస్త్తూ కూడలి వరకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పామనుగుండ్ల సర్పంచ్, ఉప సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, చెరుకు నర్సింహ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అలుగుబెల్లి శేఖర్రెడ్డి, నాయకులు అలుగుబెల్లి రాం రెడ్డి, రేకల భిక్షం, పులిగిల్ల వెంకన్న, మేడబోయిన ఆంజనేయులు, గోదల శంకర్రెడ్డి, పులిగిల్ల సైదులు, రేకల సాయి, పెంజర్ల సాగరాజు, రామ లింగయ్య, ప్రేమ్సాగర్, అశోక్రెడ్డి, దుర్గయ్య, పులిగిల్ల సతీశ్, చెరుకు సందీప్, పులిగిల్ల రవి, అలుగుబెల్లి సంపత్రెడ్డి పాల్గొన్నారు.
చిరుమర్తికే మైనార్టీల
నార్కట్పల్లి: మండల ముస్లిం మైనార్టీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారని కొనియాడారు. కారు గుర్తుకే ఓటు వేసి మూడోసారి ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్యను గెలిపించుకుంటామన్నారు. వారివెంట పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక శ్రీధర్, మైనార్టీ నాయకులు ఉన్నారు.