కట్టంగూర్, అక్టోబర్ 19 : నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపించానని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సర్కిల్ నుంచి అండర్ పాసింగ్ వరకు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ఊర్లకు రాకుండా తరిమి వేయాలన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారన్నారు. అమలుకాని హామీలతో ఓట్ల కోసం వస్తున్న పగటి వేషగాళ్ల మాటలు నమ్మవద్దన్నారు.
కాంగ్రెస్లో టికెట్ల కొట్లాటలు, గ్రూపు తగదాలు తప్ప మరేం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా.. సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరంట్ కావాలో మనందరం తేల్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పాలనకు సంపూర్ణ మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.. నకిరేకల్ ఎన్నికల ఇన్చార్జి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల కోసం రాత్రి, పగలనక కష్టపడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మరోసారి గెలిపించాలన్నారు.
రాష్ట్రంలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో కర్ణాటకలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చినే ఒక్క హామీని నెరవెర్చే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులుడు పాలడుగు హరికృష్ణ, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైద్దిరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, బీరెల్లి ప్రసాద్, చౌగోని జనార్దన్, మేకల రమేశ్, అంతటి శ్రీను, తండు పద్మ, గాజుల బుచ్చమ్మ, మునుగోటి ఉత్తరయ్య, రెడ్డిపల్లి మనోహర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భీ పామ్ అందుకున్న అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీసాయి మణికంఠ ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ రోడ్ షోకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షో సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది.నకిరేకల్: నియోజకవర్గంలో ప్రశాంత పాలన కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో వడ్డెర కుటుంబానికి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వివరించాల్సిన బాధ్యత పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కుంచం వెంకన్న, సంపంగి సురేశ్, రూపని రాంబాబు, వరికుప్పల వెంకన్న, కొడిదల శివశంకర్, గోగుల వీరస్వామి, కొడిదల బుచ్చయ్య, కొర్రల వీరబాబు, వరికుప్పల ఇద్దయ్య, ఆలకుంట్ల రమేశ్, గోసుపెద్ద నర్సింహ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు పల్లె విజయ్, గర్షకోటి సైదులు, చౌగోని సైదులు, నాయకులు పరమేశం, వెంకన్న పాల్గొన్నారు.
నకిరేకల్ : నకిరేకల్ 19వ వార్డులో ఏర్పాటు చేసిన కనకదుర్గదేవి విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం పూజలు నిర్వహించారు. అంతకుముందు వారికి ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
నార్కట్పల్లి : నార్కట్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో ప్రజ్ఞాపురం శ్రీనివాస్, రాము, శివకుమార్, సైదులు, అంశాల భాస్కర్, మేడిపల్లి సైదులు, వెంకన్న, భిక్షం, గడ్డం సత్తయ్య, శివరాం, చెన్నారపు ప్రసాద్, మేడిపల్లి శ్రీను ఉన్నారు.
చిట్యాల : మండలంలోని ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల ప్రశాంత్గౌడ్ గతంలో బీఆర్ఎస్కు రాజీనామా చేశాడు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశాంత్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించగా వెంటనే ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, ఎలికట్టె సర్పంచ్ ఉయ్యాల సత్తయ్య, ఎంపీటీసీ గొలనుకొండ దశరథ, ఉయ్యాల కృష్ణయ్య, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.