మర్రిగూడ: హరితహారంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలను ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. మండలంలోని తిరుగండ్లపల్లి, యరుగండ్లపల్లి, రాజపేటతండా గ్రామ పంచాయితీలలో రోడ్ల వెంట నాటిన మొక్కలను సోమవారం ఆయన పరిశీలించారు.
ఉపాధిహామీలో పనిచేస్తున్న వాచర్స్తో ఎప్పటికప్పుడు చెట్ల పొదలను శుభ్రం చేయించి వాటర్ ట్యాంకర్తో నీళ్లను పోయించాలన్నారు. ఆయన వెంట డీపీవో విష్ణువర్దన్ రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, ఎంపీడీవో రమేశ్ దీన్దయాల్, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీవో ఝాన్సీరెడ్డి, ఈసీ వివేక్, సర్పంచ్లు ఐతపాక జంగయ్య, మాడెం శాంతమ్మ, నున్సావత్ సక్కుబాయి తదితరులు ఉన్నారు.
బృహత్ పార్కును పరిశీలించిన జిల్లా కలెక్టర్
నాంపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పార్కుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం మండలంలోని దామెర గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పార్కును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుతం సూచించన నమూనా ప్రకారం పార్కును ఏర్పాటు చేయలన్నారు. ఆయన వెంట ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగొటి వెంకటేశ్వర్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవిందర్ రెడ్డి, ఎంపీడీవో శేషు కుమార్, సర్పంచ్ దామెర యాదగిరి, ఎంపీవో ఈశ్వరయ్య, ఆర్ఐ దయా కర్రెడ్డి, కార్యదర్శులు ఆశోక్, జావెద్ ఉన్నారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పరిశీలించిన కలెక్టర్
దేవరకొండ: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. సోమవారం కొండమల్లే పల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాటేషన్ల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్కలకు సపొర్ట్గా కర్రలు నాటాలని సూచించారు.
ఏక్కడైనా చనిపొ యిన మొక్కల స్థానంలో మళ్లీ కొత్త మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్క వద్ద పాదులు చేసి నీటిని అందించాలని సూచించారు. నీటి కొరత వున్న ప్రాంతాల్లో వ్యవసాయ బోర్ల వద్ద నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల న్నారు. మొక్కలపై అధికారులు అశ్రద్ధ వహించొద్దని కలెక్టర్ తెలిపారు. డీపీవో విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో బాలరాజ్రెడ్డి, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
మాల్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రకృతి వనంతో పాటు రోడ్ల వెంట నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సోమవారం చింతపల్లి మండల పరిధిలోని మదనాపూరం శివారులోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ భూమిలో 10ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనంలో నాటుతున్న మొక్కలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
దీంతో పాటు రోడ్డు వెంట నాటిన మొక్కలను పరీశిలించారు. మొక్కలు నాటడంతో పాటు చుట్టూ పాదులు తీసి మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వనంలో చేసే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట డీపీర్వో విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో రాజు, ఎపీఎం శౌరిరెడ్డి, సర్పంచ్ ఉడుత అఖీల అధికారులు పాల్గొన్నారు.