నల్లగొండ రూరల్, మార్చి 27 : స్వరాష్ట్రంలో నల్లగొండ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో రూ.కోటి నుంచి రూ.2.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి సస్యశ్యామలం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ముందుండాలని సూచించారు. కనగల్ మండలంలోని జి.ఎడవెల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన 16 గ్రామాల బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం కేసీఆర్ రాష్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. రాష్టం ఏర్పాటైతే ఏమొస్తదని అన్నోళ్లు ఇయ్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్తోపాటు రైతుబంధు, రైతుబీమా పథకాలు, పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ఆదుకునేలా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేని బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యను తన సమస్యగా భావిస్తూ అండగా ఉంటున్నారన్నారు.
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక ముందు, వచ్చిన తర్వాత ఎట్లుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కనగల్ మండలంలోని చిన్న గ్రామాలైన రామచంద్రాపురంలో కోటి, బచ్చన్నగూడెంలో కోటీ 50 లక్షలు, మార్తినేనిగూడెంలో రూ.2.50కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఈ గ్రామాలే కాకుండా నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మన పార్టీలో ఉన్నవారితో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. అనంతరం తుర్కపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అనంతరం ఆయా గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అంతకుముందు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో నిర్వహించిన ఆటాపాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం గౌడ్, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్రావు, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మర్రి రేణుక, నాయకులు బల్గూరి మల్లయ్య, సంజీవ, నర్సిరెడ్డి, బ్రహ్మయ్య, పద్మావతి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గ్గొన్నారు.