భువనగిరి అర్బన్, జనవరి 29 : పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యానికి అనుమతించాలని కోరారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పి.కృష్ణమూర్తి, రంగయ్య, వీరన్న, సీతారాం, అంకంపల్లి రామచంద్ర, వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, యాదయ్య, రామస్వామి పాల్గొన్నారు.