హాలియా, జనవరి 31 : గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలం కొరివేనుగూడెం గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేయగా, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమతీపురుశోత్తం, సర్పంచ్ వెంకట్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ మున్నా, బీఆర్ఎస్ నాయకులు చింతకాలయ వెంకటేశ్వర్లు, అబ్దుల్ హలీం, అంజత్ఖాన్, షేక్ జాని, జలీల్, నిమ్మల శ్రీకాంత్రెడ్డి, శ్రీను, దైద కాశయ్య, నాగరాజు, శంకర్, కొండల్ పాల్గొన్నారు.