పెద్దవూర, నవంబర్8: బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎ మ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మల్లికార్జున ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నో మంత్రి పదవులు అనుభవించిన జానారెడ్డి నియోజవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఏర్పాటు అయ్యాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు. గత ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హమీని నేరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్దే అని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే గిరిజన, ఆదివాసీలకు గుర్తింపు దక్కిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతేనే రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్ నాగర్జున సాగర్ అభ్యర్ది నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు బహూమతిగా ఇవ్వలన్నారు. గిరిజనులు అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో తండాల అభివృద్ధి సాధ్యమైందన్నారు.
గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, గోనే విష్ణువర్ధన్రెడ్డి ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్రెడ్డి, జట్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, మాజీ ఎంపీపీ కురాకుల అంతయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గజ్జెల లింగారెడ్డి, బీఆర్ఎస్కే కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్, నాయకులు కర్ణ బ్రహ్మరెడ్డి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్య క్షులు, బూత్ కమీటీ సభ్యులు పాల్గొన్నారు.
పెద్దవూర: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై భారీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం వివిధ గ్రామలకు చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి , ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ పార్టీలోకి ఆహ్వానించారు.
గుర్రంపోడు: రాష్ట్ర ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మండలంలోని మొనికానిగూడెంకి చెందిన వివిధ పార్టీలకు చెందిన 40కుటుంబాలకు సర్పంచ్ దుండిగళ్ల పద్మా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు సమక్షంలో గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఏండ్లు రాష్ర్టాన్ని పరిపాలించిన నాయకులు చేయని అభివృద్ధిని పదేండ్లలోనే సీఎం కేసీఆర్ చేశారన్నారు. ప్రజలు మరోమారు కేసీఆర్ ప్రభు త్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ సర్పంచ్ రంగరాజు వెంకటేశ్వ ర్లు, ఉప సర్పంచ్ పరమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు అలు గుబెల్లి కృష్ణారెడ్డి, నాయకులు మాచిన కొండల్రెడ్డి, కారింగ్ శేఖర్రెడ్డి, జోగు వెంకన్న, నడ్డి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.