నల్లగొండ, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్నో ప్రాజెక్టులను రాష్ర్టానికి తీసుకొచ్చి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లి ఖార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్వలి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు ఆలకుంట్ల మోహన్బాబు, మారగోని గణేశ్, బకరం వెంకన్న, అభిమన్యు శ్రీనివాస్, కటికం సత్తయ్యగౌడ్, రావుల శ్రీనివాస్రెడ్డి, జమాల్ ఖాద్రి, మైనం శ్రీను, పున్న గణేశ్, చిట్ల వెంకటేశ్, ఐతోగని యాదయ్య పాల్గొన్నారు.
దేవరకొండలో..
దేవరకొండ : ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్లో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మహనీయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్ అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, కౌన్సిలర్లు మహ్మద్ రైస్, జయప్రకాశ్నారాయణ, పొన్నబోయిన సైదులు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, చిత్రం ప్రదీప్, జనార్దన్రాజ్, ఇలియాస్ పటేల్, హరిదాస్, పొట్ట ముధు, లక్ష్మణ్, జమీర్, అఫ్రోజ్, శ్రీను పాల్గొన్నారు.
కేటీఆర్ కృషితోనే ఐటీరంగం అభివృద్ధి : ఎమ్మెల్యే భాస్కర్రావు
దామరచర్ల : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితోనే రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని వాడపల్లిలో సోమవారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. రాష్ర్టానికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి, మిర్యాలగూడ ఏఎమ్సీ చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కె. వీరకోటిరెడ్డి, ఎంపీటీసీ అనంతలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు ఎండీ యూసూఫ్, శ్రీనివాస్రెడ్డి, బాలసత్యనారాయణ, ఏడుకొండలు, రాంరెడ్డి పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తి కేటీఆర్ : ఎమ్మెల్యే నోముల భగత్
హాలియా : దేశంలో లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచిన పరిపాలనాధ్యక్షుడు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియా కాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్కట్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ కృష్ణారెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, హాలియా, నిడమనూరు మార్కెట్ చైర్మన్లు జవ్వాజి వెంకటేశం, మర్ల చంద్రారెడ్డి, పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ నల్లగొండ సుధాకర్, నాయకులు సాదం సంపత్కుమార్, కర్ణ బ్రహ్మానందరెడ్డి, కామర్ల జానయ్య, యడవల్లి మహేందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్నాయక్, ఎన్నమల్ల సత్యం, పోశం శ్రీనివాస్గౌడ్, దోరేపల్లివెంకన్న, ఉడ్తూరి శ్రీనివాస్రెడ్డి, సురభిరాంబాబు, పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
హాలియాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో..
నందికొండ : స్థానిక హిల్కాలనీలోని విజయవిహార్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అనురాధాసుందర్రెడ్డి, భగవాన్నాయక్, సుమతీ పురుశోత్తం, మున్సిపల్ కౌన్సిలర్లు రమేశ్జీ, నిమ్మల ఇందిర, నాగశీరిషామోహన్నాయక్, నాగరాణివిక్రమ్, మంగ్తానాయక్, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు శాగం రాఘవరెడ్డి, బలుగురి నాగేశ్, బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి ఆధ్వర్యంలో ఆస్పతిత్రిలో పండ్లు పంపిణీ
నకిరేకల్ : మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మీనగేష్గౌడ్, బొప్పని స్వర్ణలతా సురేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమయాదగిరి, దైద పరమేశ్, గుర్రం గణేశ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్రీడా కిట్లు
మునుగోడు : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి తనయుడు కూసుకుంట్ల శ్రీనువాస్రెడ్డి కేక్ కట్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, కేజీబీవీలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుశోత్తంరెడ్డి, ఎంపీటీసీలు బొడ్డుశ్రావణీ నాగరాజుగౌడ్, ఈద నిర్మలా శరత్బాబు, చెర్కు కృష్ణయ్య, పొలగోని విజలక్ష్మీసైదులుగౌడ్, వనం నిర్మల యాదయ్య, బొల్గూరి లింగయ్య, వెంకటమ్మావెంకటయ్య, సింగారం సర్పంచ్ గుర్రాల పరమేశ్, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, సలపరాజు రమేశ్, బంగారు రవి, యడవెల్లి సురేశ్, అల్వాల వెంకన్న, పూల వెంకన్న,రావిరాల కుమార్స్వామి సర్పంచ్లు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఫ్లోరోసిస్ బాధితుల ఆధ్వర్యంలో..
మర్రిగూడ : మండలంలోని పాకగూడెంలో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్ ఆధ్వర్యంలో ఫ్లోరైడ్ బాధితుడు మేతరి రాములు ఇంటి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల నెట్వర్క్ ప్రతినిధి శ్రీనివాస్, ఫ్లోరోసిస్ బాధితులు ఆంజనేయులు, దశరథ పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. డిండిలో నాయకులు గిరమోని శ్రీనివాసులు, మేకల కాశయ్య ఆధ్వర్యంలో, చందంపేటలో దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్నాయక్ ఆధ్వర్యంలో, పెద్దఅడిశర్లపల్లిలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో కేక్కట్చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కేక్ కట్ చేశారు. హాలియా మండలంలోని శ్రీనాథపురం గ్రామంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు డ్రోన్ద్వారా ఉచితంగా పురుగుల మందు పిచికారీ చేశారు. త్రిపురారంలో రజక సంఘం ఆధ్వర్యంలో, గుర్రంపోడులో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గాలి సరితారవికుమార్ కేక్ కట్ చేశారు.
జిల్లా కేంద్రంలో..
నల్లగొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలనీలో బీఆర్ఎస్ నాయకుడు అనీస్ ముకతదర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కనగల్ క్రాస్రోడ్డులో పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్చేసి భారీ పటాకులు కాల్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.మిఠాయిల పంపిణీ చేశారు. కట్టంగూర్ శాలిగౌరారం, కేతేపల్లి, గట్టుప్పల్, మర్రిగూడ మండలకేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. శాలిగౌరారం మండలం మాదారం గ్రామంలో మొక్క నాటారు. మర్రిగూడ మండలం పాకగూడెంలో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాశ్ ఆధ్వర్యంలో ఫ్లోరైడ్ బాధితులు కేక్ కట్ చేశారు.