నకిరేకల్, జనవరి 8 : నకిరేకల్ పరిధిలోని రైతులందరూ భూసార పరీక్ష యంత్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీకి నాబార్డు తెలంగాణ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ సార పరీక్ష యంత్రాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం యంత్రం పనివిధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటలు వేసి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి వాడపల్లి రమేశ్, కౌన్సిలర్లు గాజుల సుకన్య, బానోతు వెంకన్న, కందాల భిక్షంరెడ్డి, నాయకులు బచ్చుపల్లి గంగాధర్రావు పాల్గొన్నారు.
గర్భిణులు ప్రశాంతత కలిగి ఉండాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. సోమవారం సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రామకృష్ణ మఠం, హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆర్యజనని ఆధ్వర్యంలో గర్భిణులకు ఆన్లైన్ శిక్షణా శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు 250 మందికి పైగా గర్భిణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్యజనని చైర్మన్ అనుపమ శశిధర్రెడ్డి, ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, ఎంపీడీఓ రమేశ్, సీడీపీఓ ఆశ్రా అంజుమ్, ఎంపీఓ నాగలక్ష్మీ, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు పెండెం స్వర్ణలత చంద్రశేఖర్, కోనేటి వెంకటయ్య పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మండలంలోని చిన్నతుమ్మలగూడెంలో రూ. 5లక్షలతో గ్రామ పరిధిలోని ఆవులోని గూడెంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని చిన్నతుమ్మలగూడెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజలందరూ హెల్త్క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
చిట్యాల : ముదిరాజ్ మహాసభ చిట్యాల మండల క్యాలెండర్ను ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం ఆవిష్కరించారు. సంఘం మండలాధ్యక్షుడు బుంగపట్ల తిమ్మ య్య, ప్రధాన కార్యదర్శి గుడిసె యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప్పరబోయిన స్వామి, నక్క రాంబానేశ్, పందిరి శ్రీనివాసు, సాదుల నరసయ్య పాల్గొన్నారు.