నకిరేకల్, జనవరి 31 : నకిరేకల్ పట్టణాన్ని రాజకీయాలతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ శకుంతల ఫంక్షన్ హాల్లో బుధవారం పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్ బాలాజీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఎన్ని నిధులైనా వెనుకాడేది లేదని, నాణ్యతలో ఏమాత్రం రాజీపడబోమని తేల్చి చెప్పారు.
పలు పార్టీల, పట్టణ ప్రముఖుల నుంచి వచ్చిన సలహాలను స్వీకరించి ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పార్టీల ప్రతినిదులు మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, పీఆర్ఏఈ గౌతమ్రాజ్, ఆయా పార్టీల ప్రతినిధులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కొండ జానయ్య, గాజుల సుకన్య, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, వంటెపాక వెంకటేశ్వర్లు, చెట్టిపల్లి కాశీ రాం, యాతాకుల అంజయ్య, పాల్గొన్నారు.
కట్టంగూర్: మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలోని సవుళ్లగూడెంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, స్థానిక సర్పంచ్ సుంకనబోయిన వెంకన్న, మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, ఉప సర్పంచ్ నిమ్మనగోటి లింగస్వామి, ఎంపీటీసీ హరికృష్ణ,పాల్గొన్నారు.
నార్కట్పల్లి : గోపలాయపల్లి పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సర్పంచులు కార్యదర్శులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. అనంతరం సర్పంచ్ గోసుల భద్రాచలం, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, బత్తుల ఊషయ్య, సట్టు సత్తయ్య, దార యాదయ్య పాల్గొన్నారు.