నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని దేవరకొండ రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం మూర్పునుతల గ్రామంలో రూ.80 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు, గుంటిపల్లి గ్రామంలో రూ.2.75కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి, మాజీ ఎంపీపీలు ముత్యాల సర్వయ్య, ఏర్పుల గోవిందు యాదవ్, రైతుబంధు అధ్యక్షులు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉజ్జిని విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచులు బొల్లు అలివేలు, మాధవరం శంకర్ రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వీర రెడ్డి, రమావత్ మోహన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.