కొండమల్లేపల్లి, జూలై 19 : కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండలంలోని పెండ్లిపాకుల రైతువేదికలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్రెడ్డి గ్రామాల్లోకి వచ్చి మూడు గంటల కరెంట్ ఇస్తామని చెబితే రైతులు తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అనగా, ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేశారని, నాడు రైతుల ఉసురు తగిలి చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోయాడని, అదే గతి రేవంత్రెడ్డికి పడుతుందని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియక రైతులు పొలాల వద్దే నిరీక్షించారని గుర్తుచేశారు. నేడు స్వరాష్ట్రంలో అన్నదాతలకు మంచి రోజులు వచ్చాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తో పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మెచ్చి కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే అవార్డులు ప్రకటించిదన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? మూడు పంటలకు కరెంట్ అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? రైతులు తమ గ్రామాల్లో రచ్చబండ దగ్గర చర్చింకోవాలని సూచించారు. మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ నాయకులకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాంబాబునాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, జడ్పీటీసీ సలహాదారు పస్నూరి యుగేంధర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రమావత్ తులసీరాంనాయక్, మాడ్గుల యాదగిరి, నేనావత్ శంకర్నాయక్, రమావత్ మంతూనాయక్, బాలూనాయక్, మధునాయక్, హరికృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.