భువనగిరి అర్బన్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్రామ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దన్నారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం గొప్ప కాదని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రజలు బండి సంజయ్కి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మహిళలను కించే పరిచే విధంగా మాట్లాడితే రాష్ట్రంలోని మహిళా లోకం తిరగబడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, మహిళా కౌన్సిలర్లు కడారి ఉమాదేవి, నజియారహమాన్, నాయకురాలు సిద్దుల పద్మ పాల్గొన్నారు.