భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 26 : క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకు రావాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 67వ సూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ రెండో రోజు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలు మేథో శక్తిని పెంపొందిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవి.కిరణ్కుమార్, క్రీడల కార్యదర్శి స్టాలిన్బాబు, పీఈటీలు పాల్గొన్నారు.
విజేతలు..
అండర్-17 బాలుర విభాగంలో ప్రథమ బహుమతి రాజాపేట, భువనగిరి జట్టు ద్వితీయ బహుమతి సాధించింది. బాలికల విభాగంలో వలిగొండ ప్రథమ, బొమ్మలరామారం ద్వితీయ బహుమతిని సాధించారు. అండర్-14 బాలికల విభాగంలో మోటకొండూర్ ప్రథమ, గుండాల ద్వితీయ, అండర్-17 హ్యాండ్ బాల్ బాలుర విభాగంలో ఎం.తుర్కపల్లి ప్రథమ, రాజాపేట ద్వితీయ, బాలికల విభాగంలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ అడ్డగూడూర్ ప్రథమ, భువనగిరి ద్వితీయ, అలాగే అండర్-14 బాలుర విభాగంలో భువనగిరి ప్రథమ, చౌటుపల్ ద్వితీయ, బాలికల విభాగంలో ఆత్మకూర్(ఎం) ప్రథమ, భువనగిరి ద్వితీయ బహుమతిని సాధించారు. అండర్-17 కబడ్డీ బాలుర విభాగంలో భువనగిరి ప్రథమ, సంస్థాన్ నారాయణపూర్ ద్వితీయ, బాలికల విభాగంలో యాదగిరిగుట్ట ప్రథమ, చౌటుప్పల్ ద్వితీయ బహుమతిని సాధించారు. అండర్-14 బాలుర విభాగంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రథమ బహుమతి, భువనగిరి ద్వితీయ, బాలికల విభాగంలో మోటకొండూర్ ప్రథమ బహుమతి, వలిగొండ ద్వితీయ బహుమతి సాధించారు.